ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాల్ రాజ్
నవతెలంగాణ – బాన్సువాడ నసురుల్లాబాద్ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో మురికి కాలువల్లో చెత్తచెదారం వేయకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు సూచించారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని వార్డుల్లో తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో చెత్తాచెదారం లేకుండా మురికి కాలువలు శుభ్రం ఉండేలా మున్సిపల్ సిబ్బంది సహకరించాలని. మురికి కాల్వలో చెత్త చెదారం వెయ్యరాదన్నారు. వర్షాకాలం వచ్చిందంటే మురికి కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయి నీరు నిలిచిపోతుందని, దీనితో అంటూ వ్యాధులు వ్యాపిస్తాయని స్థానికులకు వివరించారు. మురికి కాలువల్లో చెత్తాచెదారం ఉండడంతో దోమలు, ఈగలు వృద్ధి చెందుతాయని, ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యతగా మురికి కాలువల్లో చెత్తాచెదారం వేయకుండా మున్సిపల్ చెత్త వాహనంలో వేయాలన్నారు. కార్యక్రమంలో అంజి రెడ్డి, నార్ల సురేష్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాలేఖ్, ఎజాజ్, బాబా, పిట్ల శ్రీధర్, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.
మురికి కాలువల్లో చెత్త వెయ్యరాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES