- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
శ్రావణమాసం సందర్భంగా మూడు రాష్టాల (తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక) భక్తులు సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తారు. దూర ప్రాంతాల నుండి భక్తులు భజన, కీర్తనలతో పాదయాత్ర ద్వారా ఆలయానికి చేరుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. క్యూ లైన్ ల ద్వారా తమ మొక్కులు చెల్లించుకున్నారు. నైవేద్యాలు, అర్చనలు చేయించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు భారీ ఎత్తున అన్నదనా కార్యక్రమాలను చేపట్టారు.
- Advertisement -



