- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
అచ్చంపేటలోని ఉమామామహేశ్వరo గుడికి ఉప్పునుంతల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిప్పర్తి నర్సింహారెడ్డి తన తండ్రి కీర్తిశేషులు తిప్పర్తి రుక్మారెడ్డి గారి జ్ఞాపకార్థంగా రూ.5 లక్షల విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని టిపిసిసి ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చేతుల మీదుగా గుడి నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు, గ్రామస్థులు నర్సింహారెడ్డి కుటుంబ సేవా మనసును ప్రశంసించారు.
- Advertisement -