Sunday, June 8, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జువాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా లైఫ్ మెంబర్‌గా డాక్టర్. రాకేష్ దావెల్ల

జువాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా లైఫ్ మెంబర్‌గా డాక్టర్. రాకేష్ దావెల్ల

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మొర్రిగూడ గ్రామం ఎస్సి కాలనీకి చెందిన ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ రాకేష్ దావెల్ల జువాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (Zoological Society of India) లైఫ్ మెంబర్‌గా ఎంపికయ్యారు. జంతుశాస్త్ర పరిశోధనలలో ఆయన చేసిన గణనీయమైన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. డా. రాకేష్ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారీ పర్యవేక్షణలో రుమెక్స్ వాస్కారియస్ ఆకు నుండి యాంటీ డయాబెటిక్ ఏజెంట్‌ను వేరు చేయడం, లక్షణాలు నిర్ధారించడం, అలాగే డయాబెటిక్ ఎలుకలలో జీవ ప్రక్రియ విలువ నిర్ధారణ పై పరిశోధన చేసినందుకు గాను కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ పట్టా పొందారు. అంతేకాక మినుములు, మొక్కజొన్న పై కూడా పరిశోధనలు చేశారు. ఆయన పరిశోధన ఫలితాలు అనేక జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గల జర్నల్‌లలో ప్రచురించబడి, శాస్త్రీయ వర్గాల్లో విశేష గుర్తింపు పొందాయి. ఫైటోకెమికల్స్ ద్వారా ఆల్ఫా- గ్లూకోసిడేజ్  ఆల్ఫా ఏమైలేజ్ లక్ష్యంగా మోలిక్యులర్ డాకింగ్ విశ్లేషణ ద్వారా కొత్త యాంటీడయాబెటిక్ ఏజెంట్ల గుర్తింపు మీద చేసిన పరిశోధన కి గాను పేటెంట్ కూడా రావటం జరిగింది. మధుమేహం మీద విస్తృత పరిశోధనలను చేస్తూనే వ్యవసాయంలో సుస్థిరత, పంటల పరిరక్షణకు దోహదం చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగే డా. రాకేష్ సాధన ఈ గుర్తింపుకు దారితీసింది. ప్రస్తుతం ఆయన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికక్చరల్ యూనివర్సిటీ లోని పెస్టిసైడ్ రెసిడ్యూస్ లేబొరేటరీలో రీసెర్చ్ అసోసియేట్ గా సేవలు అందిస్తున్నారు. డాక్టర్ రాకేష్ ను సొసైటీ లైఫ్ మెంబర్‌గా ఎంపిక చేయడం పట్ల విద్యా, పరిశోధనా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -