నవతెలంగాణ – మద్నూర్ : డోంగ్లి మండలంలోని చిన్న టాక్లి గ్రామంలో బుధవారం అంగన్వాడి కేంద్రం పరిధిలో తల్లులు కిషోర్ పిల్లలకు అమ్మ మాట అంగన్వాడి బాట అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ సూచిత అంగన్వాడి ఆయా లక్ష్మీ బాయి గ్రామ సంఘం అధ్యక్షురాలు గంగమని గ్రామ ఆశ వర్కర్ అన్నపూర్ణ పాల్గొనడం జరిగింది. గ్రామంలో ర్యాలీని నిర్వహించడం జరిగింది. తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది. తమ పిల్లలకు తల్లులు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు బడికి పంపించాలని కోరారు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎగ్ బిర్యాని పెట్టడం జరిగింది. అంగన్ వాడీలో బడిగంట మొగించడం జరిగిందని అంగన్వాడీ టీచర్ సూచిత అంగన్వాడి సాయికురాలు లక్ష్మి బయి తెలిపారు.
చిన్నటాక్లిలో అంగన్వాడి చిన్నారులకు ఎగ్ బిర్యాని
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES