గుడ్లు అందేలా చర్యలు తీసుకుంటాం: సూపర్వైజర్ కవిత
నవతెలంగాణ – మద్నూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అంగన్వాడి పిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు ప్రతిరోజు మంచి పౌష్టికాహారం కోసం గుడ్లు అందిస్తున్నారు. అయితే తాజాగా మండల పరిధిలోని అంతాపూర్ అంగన్వాడీకి దాదాపు 15 రోజులుగా గుడ్లు సరఫరా కావడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు, అంగన్ వాడీ టీచరే చెబుతున్నారు. దీనివల్ల చిన్నారులకు పోష్టికాహారం కరువైనట్లే అని చెప్పవచ్చు. ఈ క్రమంలో నవతెలంగాణ ఐసిడిఎస్ సూపర్వైజర్ కవితను వివరణ కోరగా.. గుడ్లు లేని విషయం అక్కడి అంగన్వాడీ టీచర్ మా దృష్టికి తేలేదని, గుడ్ల సరఫరా గురించి వెంటనే చర్యలు తీసుకొని ఆ కేంద్రానికి గుడ్లు అందించే విధంగా చూస్తామని వివరణ ఇచ్చారు.
అంతాపుర్ అంగన్వాడీకి అందని గుడ్లు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES