ప్రధాని మోడీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖ
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
లోక్సభకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను తక్షణమే ప్రారంభిం చాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆయన మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఎటువంటి జాప్యం చేయకుండా ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. 16వ లోక్సభ ప్రారంభమయ్యే వరకు ప్రతి సభలోనూ డిప్యూటీ స్పీకర్ ఉన్నారని, ప్రతిపక్ష పార్టీల నుంచి డిప్యూటీ స్పీకర్ను ఎన్ను కోవడం ఆనవాయితీ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. కానీ తొలిసారి ఆ పదవి రెండు పర్యాయాల నుంచి ఖాళీగా ఉంటోందని ఖర్గే విమర్శిం చారు. ఇది రాజ్యాంగంలోని హక్కులను ఉల్లంఘించడేమనని ఆయన అన్నారు.
లోక్సభ డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోండి
- Advertisement -
- Advertisement -