బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఇ సాయిపేట్ నరేష్
నవతెలంగాణ-రామారెడ్డి ప్రభుత్వం విద్యా సంస్థలు బలపడాలంటే, బడిబాటతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల పిల్లలను ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివించాలని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బడిబాట చేపట్టిన ఉపాధ్యాయుల నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆయా శాఖలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిస్తే, విద్యాసంస్థలన్నీ బలోపేతమై విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పని చేస్తున్న గురువులు అర్హత కలిగి, నైపుణ్యం కలిగి, నాణ్యమైన విద్య బోధన అందిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి చేయాలని , పేద ధనిక తేడా లేకుండా ఒకే విద్యావ్యవస్థలో చదువుకునే సాంస్కృతిని తీసుకురావాలని సూచించారు.
ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES