- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలోని జూపల్లి గ్రామానికి సంబంధించిన సబ్ స్టేషన్ స్థలము అక్రమణకు గురైందని గ్రామస్తులు డిఈ కి వినతి పత్రం సమర్పించారు. జూపల్లి భూస్వాములు ఒక ఎకరం 10 కుంటల స్థలం ఇవ్వడంతో 2002 – 03 సంవత్సరంలో సబ్ స్టేషన్ కు పునాది పడిందని తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఖాళీ స్థలంలో ఉన్న కంచె ను జెసిబి సహాయంతో తొలగించి ,హద్దులను చెరిపేసి అక్రమంగా సబ్ స్టేషన్ స్థలాన్ని కబ్జా చేసుకోవడం జరిగింది. కబ్జాకు గురైన సబ్ స్టేషన్ స్థలాన్ని పరిరక్షించాలని డిఈ ను కోరారు.
- Advertisement -