Saturday, June 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత ..

పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత ..

- Advertisement -

– అటవీ రేంజ్ అధికారి బి.రవీందర్ 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని, మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని కమ్మర్ పల్లి అటవీ రేంజ్ అధికారి బి.రవీందర్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ రేంజ్ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అడవి రేంజ్ అధికారి రవీందర్ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయును అందించాలంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు.ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలను తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మనము నాటి సంరక్షించే మొక్కలే వృక్షాలై భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు  అందించేందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు.అనంతరం మొక్కలు నాటి, సంరక్షించి పర్యావరణాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అటవీ రేంజ్ కార్యాలయ పరిసరాలలో స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించి చెత్తాచెదారం తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి అటవీ రేంజ్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ అటవీ రేంజ్ అధికారులు ఏ. శ్రీనివాస్, బి. దేవిదాస్, అటవీ రేంజ్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -