Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదవి పోయినా ప్రజల వెంటే..

పదవి పోయినా ప్రజల వెంటే..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి భూ హక్కుల పథకం రెవిన్యూ సదస్సులు ఈ నెల 3న ప్రారంభమైంది. ఈ సదస్సులు ఈనెల 20 వరకు కొనసాగనున్నాయి. ఈ సదస్సులో భాగంగా ఈనెల 5 న మద్నూర్ మండలంలోని కొడిచర గ్రామంలోని రైతు వేదికలో భూభారతి రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆ గ్రామ రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్ సంతోష్ పటేల్ తాజా మాజీ ఎంపిటిసి కుమారుడు సంజయ్, రైతు వేదికలో గ్రామ రైతుల సమస్యలు ఆ ఇరువురు నాయకులు అధికారులకు విన్నవిస్తూ భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేశారు. ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్, తాజా మాజీ ఎంపీటీసీ ప్రజా సమస్యల పరిష్కారానికి పదవులు పోయినా ప్రత్యేకంగా కృషి చేస్తామన్నారు. ఆ నాయకుల పనితీరు పట్ల ఆ గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ రెవెన్యూ సదస్సులో డిప్యూటీ తహసిల్దార్ రవి, ఆర్ ఐ శంకర్, రెవిన్యూ అధికారులు, వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -