నాటిన మొక్కలను సంరక్షించాలి
పలు ప్రాంతాలలో సందర్శించిన మున్సిపల్ కమిషనర్
నవతెలంగాణ – కంఠేశ్వర్ : ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని నాటిన మొక్కలను సంరక్షించాలని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ సూచించారు. ఈ మేరకు గురువారం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద తెలంగాణ రైజింగ్ చొరవలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మహోత్సవం, చెట్ల కోసం మహిళలు చేపట్టిన మొక్కల పెంపకం కార్యక్రమాన్ని కమిషనర్ రామర్తి చెరువు పార్క్, కలూర్ ట్యాంక్ బండ్ అండ్ లక్ష్మీ సాయి ప్రియా నగర్లో సందర్శించారు. సిబ్బంది అధికారులతో కలిసి కమిషనర్ మొక్కలు నాటారు. సరైన నీరు త్రాగుట మరియు అన్ని మొక్కలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, టిఎంసి, పిఆర్ పి, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, రిసోర్స్ పర్సన్లు, ఎస్ హెచ్ జి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES