- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కర్నూలు పట్టణంలోని బాలాజీ నగర్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లు పేలడంతో కూలర్ల గోదాంలో ప్లాస్టిక్ సామగ్రి ఉండటంతో మంటలు చెలరేగి, భారీగా పొగలు అలముకున్నాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.వేసవి కాలం సమీపిస్తుండటంతో గోదాంలో పెద్ద ఎత్తున కూలర్లు, వాటికి సంబంధించిన ప్లాస్టిక్ బాడీలు నిల్వ ఉంచడంతో మంటలు క్షణాల్లోనే ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి.
- Advertisement -



