- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రమైన రంజల్ పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కంటి చపు పరీక్షలను నిర్వహించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ మల్లయ్య దృష్టిలోపం ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి కంటి అద్దాలను, మందులను ఉచితంగా అందజేశారు. విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కట్ట ఆంజనేయులు, ఆరోగ్య విస్తీర్ణ అధికారి పేరు రవీందర్, ఉపాధ్యాయులు కిషోర్ కుమార్, నాందేవ్, ఆరోగ్య కార్యకర్త వసంత, ఆశ వర్కర్లు సుజాత, పద్మజ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



