దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ లోని సమీకృత భవన కార్యాలయంలో వికలాంగులు తమ సమస్యల కోసం కార్యాలయానికి వస్తే లిఫ్ట్ లేక అధికారుల వద్దకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని వెంటనే వికలాంగులకు సౌకర్యాలు కల్పించాలని దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆర్డీవో కార్యాలయంలో గురువారం వినతి పత్రం అందజేశారు. సమస్యలు తెలియచేయడానికి వచ్చినప్పుడు పైకి ఎక్కలేక పోతున్నామని, కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ మరియు ర్యాంపు నిర్మించి వికలాంగులు పడుతున్న సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సంపత్, డివిజన్ అధ్యక్షులు వెంకటేష్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సరిత, డివిజన్ ప్రధాన కార్యదర్శి నవీన్ రెడ్డి, శ్రీను, ప్రవీణ్. రాజు తదితరులు పాల్గొన్నారు.
ఆర్డిఓ కార్యాలయంలో సౌకర్యాలు కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES