Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచర్లలో రైతు భరోసా పండగ సంబరాలు

తాడిచర్లలో రైతు భరోసా పండగ సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : ప్రభుత్వం రైతు భరోసానిధులు తొమ్మిది రోజుల్లో పూర్తి చేసిన సందర్భంగా మంగళవారం మండల కేంద్రమైన తాడిచర్ల రైతు వేదికలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు భరోసా పండుగ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి,రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి,స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ గా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన ప్రతి ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్దపీట వేస్తుందన్నారు.

రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో మంథని నియోజక వర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలన్న ద్రుడ నిశ్చయంతో మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారన్నారు.కానీ కొందరు ఉనికి కోసం పిచ్చి పట్టిన కోతిలా వ్యవహరిస్తూ మంత్రి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక విమర్శిస్తున్నారని అలాంటి కబోధులకు అభివృద్ధి కనబడదని,అట్టివారిని పట్టించుకోనక్కర్లేదన్నారు.ఈ కార్యక్రమంలో తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య,వైస్ ఛైర్మన్ ప్రకాష్ రావు, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,సింగిల్ విండో డైరెక్టర్ వొన్న తిరుపతి రావు, కాంగ్రెస్ నాయకులు కేశారపు చెంద్రయ్య, మేనం సతీష్,తిర్రి సమ్మయ్య,రాజా సమ్మయ్య,మధు,కిషన్ నాయక్,రాజేశ్వర్ రావు,కిష్టయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -