నవతెలంగాణ-పెద్దవూర
భూ భారతి చట్టంతో రైతులు భూ సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చని తహసీల్దార్ శ్రీనివాస రావు అన్నారు.శుక్రవారం మండలంలోని ఉట్లపల్లి గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తు లను పరిశీలించి మాట్లాడారు. భూములపై రైతులకు పూర్తి హక్కు లను కల్పించేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని అ మల్లోకి తీసుకొచ్చిప్రజల వద్దకు వెళ్లి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించాలనే లక్ష్యంతో ఈనెల 20వరకు గ్రామాలలో రెవన్యూ సదస్సులు జరుగుతాయన్నారు. ప్రతి మనిషికి ఆధార్కార్డు ఉన్నట్లే భూమికి భూధార్కార్డు అందించడం జరుగుతుందన్నారు. ఇకమీదట భూముల క్రయవిక్రయాలకు తప్పనిసరిగా మ్యాప్ జతచేయాలన్నారు. సాదాబైనామా దరఖాస్తులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రస్తుతం భూమి ఎవరి కబ్జాలో ఉందో తెలుసుకోవడానికి పంచనామా నిర్వహించి పట్టాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. భూముల మ్యుటేషన్ సమయంలో కుటుంబ సభ్యులందరికి తప్పనిసరిగా నోటీసులు జారీచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ లు దండ శ్రీనివాస్ రెడ్డి, ఎంఆర్ఐ హబీబ్, రైతులు పాల్గొన్నారు.
భూ భారతి చట్టంతో రైతులు భూ సమస్యలు పరిష్కకరించు కోవచ్చు: తహసీల్దార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES