- Advertisement -
-గ్రోమోర్ వద్ద రైతుల ఎదురుచూపులు
-పీఏసీఎస్ వద్ద రాళ్లు, కట్టెలు, గడ్డితో వరుసలు
నవతెలంగాణ – బెజ్జంకి
మండలంలో యూరియా కోసం రైతుల ఇక్కట్లు తప్పడంలేదు. సోమవారం మండల కేంద్రంలో యూరియా అందుబాటులో ఉందనే సమాచారంతో మండలంలోని అయా గ్రామాల రైతులు యూరియా కోసం పీఏసీఎస్ కార్యాలయం వద్ద రాళ్లు, కట్టెలు, గడ్డితో వరుసలు పెట్టి గ్రోమోర్ వద్ద పడిగాపులు కాశారు. కొంతమంది రైతులకు గ్రోమోర్ నిర్వహాకులు కొంతమంది రైతులకు టోకెన్లు జారీ చేసి యూరియా బస్తాలు పంపిణీ చేయడం వివక్ష చూపడమేనని పలువురు రైతులు అసహనం వ్యక్తం చేశారు.
- Advertisement -