Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి

రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని వ్యవసాయ విస్తీర్ణ అధికారి గుజ్జేటి  శ్యాం కుమార్  కోరారు. శుక్రవారం మండలంలోని కోన సముందర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమంలో భాగంగా రైతు వారిగా రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫార్మర్ రైతు వారీగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని, రైతులందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆధార్ తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు 11 నెంబర్లతో విశిష్ట సంఖ్య (యూనికోడ్) ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగిందన్నారు.భూమి ఉన్న ప్రతి రైతు తనకు ఉన్న భూములకు సంబంధించిన వివరములతో కూడిన సమాచారంతో ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నిర్మించబడుతుందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. పిఎం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడత లబ్ధి పొందుటకు ప్రామాణికంగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. రైతులు తప్పనిసరిగా ఈనెల 10లోగా  ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -