Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు పక్షపతి కాంగ్రెస్ : ఎమ్మెల్యే కుంభం

రైతు పక్షపతి కాంగ్రెస్ : ఎమ్మెల్యే కుంభం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  : తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా నిధులు రైతులకు అందజేసినందుకుగాను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికి రైతు భరోసా నిధిలు కేవలం 9 రోజుల్లోనే 9వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయినందున ధన్యవాదాలు తెలియజేస్తూ  భువనగిరి ప్రిన్స్ కార్నర్ చౌరస్థాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయం చైర్మన్ అవైస్ చిస్తీ, పొత్నాక్ ప్రమోద్ కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, తాంగేళ్లపల్లి రవి కుమార్, కూర వెంకటేష్, బర్రె జహంగీర్, మంగ ప్రవీణ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, నర్సింహా,బాంబ్ శ్రీను,కొండల్ రెడ్డి, ప్రదీప్, సలాద్దీన్, ఈరపాక నర్సింహా, ననం కృష్ణ, బిస్కోంట్ల సత్యనారాయణ, వాసు దేవ్, పిట్టల బాలరాజు ,అభిద్ అలీ, రమణ, వెంకటేష్, మహేందర్ లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -