నవతెలంగాణ – అశ్వారావుపేట : నియోజకవర్గంలో 15 ఎకరాల లోపు మొత్తం 45058 మంది రైతులకు రూ. 81.39 కోట్లు రైతు బరోసా నిధులు వారి ఖాతాల్లో జమ చేయటం జరిగింది అని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. రైతు భరోసా విజయోత్సవాలులో భాగంగా మంగళవారం అశ్వారావుపేట రైతు వేదిక లో ఏర్పాటు చేసిన రైతు నేస్తం లో ఆయన పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖా ముఖి కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా లో నేటి వరకు 1,76,236 మంది రైతులకు రూ.305.09 కోట్లు బరోసా వేయగా అశ్వారావుపేట నియోజక వర్గంలో 45058 రైతులకు 81.39 కోట్లు జమ చేయటం జరిగింది అని తెలిపారు.
బయో చార్ తో నేలకు సారం, రైతుకు రొక్కం – కలెక్టర్ జితేష్ వి.పాటిల్ : బయో చార్ సాగులో వినియోగించడం ద్వారా నేలకు సారం అందుతుందని,దాని తయారీ ద్వారా ఉత్పత్తి దారులకు రొక్కం వస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటి తెలిపారు. రైతు బరోసా సంబురాల్లో పాల్గొనడానికి మంగళవారం అశ్వారావుపేట వచ్చిన ఆయన స్థానిక రైతు వేదికలో మల్లాయిగూడెం సేంద్రియ వ్యవసాయ సాగు దారులు ఉత్పత్తి చేసి ప్రదర్శించిన బయో చార్ ను పరిశీలించారు.
అనంతరం రైతులతో మాట్లాడుతూ పంట వ్యర్ధాలు,పశువుల పెంట ను కాల్చడం ద్వారా తయారయ్యే బయో చార్ నేలలో సారం పెంపొందించేందుకు సేంద్రీయ ఎరువుగా ఉపయోగ పడుతుందని అన్నారు. బయోమాస్ యొక్క పైరో లైసిస్ తర్వాత మిగిలి ఉన్న తేలికైన నల్ల అవశేషాలు తో ఇందులో కార్బన్ మరియు బూడిద ఉంటాయి ఉండటంతో బయో చార్ ఉత్పత్తి అయిన వెంటనే స్టెరైల్ అవుతుంది అన్నారు.
బయో చార్ ప్రధానంగా నేలల్లో నేల వాయువును పెంచడానికి, గ్రీన్ హౌస్ వాయువుల నేల ఉద్గారాలను తగ్గించడానికి,పోషక లీచింగ్ ను తగ్గించడానికి, నేల ఆమ్లత్వం ను తగ్గించడానికి, ముతక నేలల్లో నీటి శాతాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. వ్యవసాయ భూమిలేని నిరుపేదలు దీన్ని ఉత్పత్తి గా ఎంచుకుంటే రైతులు దీన్ని కొనుగోలు చేయడం ద్వారా వీరికి ఉపాధి లభ్యం అవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శిక్షణా కలెక్టర్ సౌరవ్ శర్మ, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి బాబూరావు,పట్టు పరిశ్రమ ఉద్యాన శాఖ జిల్లా అధికారి జంగా కిషోర్,ఏడీ ఏ పి.రవి కుమార్,ఎన్పీడీసీఎల్ ఏడీఈ వెంకటరత్నం,మున్సిపల్ కమీషనర్ సుజాత,ఏవో శివరాం ప్రసాద్,పీఏసీఎస్ అశ్వారావుపేట అద్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ,మాజీ అద్యక్షులు మొగళ్ళపు చెన్నకేశవ రావు,మాజీ ఉపాధ్యక్షులు సుంకవల్లి వీరభద్రరావు, జూపల్లి రమేష్,తుమ్మ రాంబాబు,అశ్వారావుపేట మాజీ సర్పంచ్ చీమకుర్తి వెంకటేశ్వరరావు లు పాల్గొన్నారు.