సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశనాయక్
నవతెలంగాణ – అచ్చంపేట : రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని, రైతు భరోసా అమలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అచ్చంపేట మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. డిమాండ్లతో కూడిన వినపత్రాన్ని కార్యాలయం సిబ్బందికి ఇచ్చారు. ముఖ్యఅతిథిగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశనాయక్ హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలను ప్రలోభాలకు గురిచేసి ఎన్నో హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం, నాయకులు, మంత్రులు, పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఎన్నో ఆశలు కల్పించారు. కానీ అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప, రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నా నేటికీ రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేకుండా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది అన్నారు. బ్యాంకుల ద్వారా రైతులకు సాగు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలకుల వల్ల బ్యాంకర్లు రైతులపై నిర్లక్ష్యం చూపుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతాంగ సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల్ని రైతులని సమీకరించి, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని దేశనాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గం సైదులు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బి. రాములు, శివకుమార్, పర్వతాలు, వెంకటయ్య, బక్కయ్య, పర్వతాలు, తిరుపతయ్య,వెంకటమ్మ, రజిత, లక్ష్మి, సాగర్, వి నాయక్, సూర్య, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు రైతు భరోసా ఇచ్చి, రుణమాఫీ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES