- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్: రైతులు ఆయిల్ పామ్ పంట వేసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి రాజా గౌడ్ సూచించారు. పంట వైవిధ్యంలో భాగంగా రైతులు సంప్రదాయ పంటలు మాని ఆయిల్ పామ్ పంట వేసుకోవాలని , మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని చేపూరు లో ఉన్న ప్రియూనిక్ ఆయిల్ పామ్ కంపెనీ నర్సరీని సందర్శించారు. డివిజనల్ ఉద్యాన అధికారులు పంట యొక్క విశిష్టతను ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఉద్యాన అధికారులు రాజు, రోహిత్, వినాయక్, కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -