నవతెలంగాణ – మద్నూర్
నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ ఎన్.ఎం. ఈ.వో. పథకం కింద డి ఎస్ బి34 రకం సోయాబీన్ విత్తనాలు రైతులకు సరఫరా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పెద్ద శక్కర్గ గ్రామంలో క్షేత్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించి రైతులకు సోయాబీన్ పంటల మీద ప్రస్తుత పంట యాజమాన్య పద్ధతుల గురించి వివరించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి రాజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏరువాక శాస్త్రవేత్త అనిల్ రెడ్డి , సోయాబీన్ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు సూచించడం జరిగింది. అలాగే సోయాబీన్ వేసిన పంట పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి , పొగాకు లద్దె పురుగు మరియు పల్లాకు తెగులు గమనించి తగు నివారణ చర్యలు ఎలాంటి మందులు వాడాలని దానిపై వివరించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, ఎఫ్ పి ఓ చైర్మన్ చట్లవార్ గోపాల్, శక్కర్గ ఏఈ వో సరోజ , గ్రామ రైతులు పాల్గొన్నారు.