నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మేనూర్ రైతు వేదికలో సోయాబీన్ పంటపై వ్యవసాయ శాఖ రైతులకు క్షేత్ర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజు రైతులకు వివరిస్తూనేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ పథకం కింద డి ఎస్ బి34 రకం సోయాబీన్ విత్తనాలు రైతులకు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు.అందులో భాగంగా మంగళవారం క్షేత్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించి రైతులకు సోయాబీన్ పంటల మీద ప్రస్తుత పంట యాజమాన్య పద్ధతుల పై వివరించారు.
ఈ కార్యక్రమంలో సైటిస్ట్ అనిల్ రెడ్డి సోయాబీన్ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు సూచించడం జరిగింది. అలాగే సోయాబీన్ వేసిన పంట పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి , పొగాకు లద్దె పురుగు మరియు యెల్లో మోసాయిక్ వైరస్ గమనించి తగు నివారణ చర్యలు తెలపడం జరిగినది. ఈ కార్యక్రమంలో సైటీస్ట్ రెవన్, ఏవో రాజు, ఎఫ్ పి ఓ చైర్మన్ చట్లవార్ గోపాల్, ఏఈ వో విశాల్ గౌడ్, గ్రామ రైతులు కుశల్, గంగారాం, భీంరావు, గోపాల్,నగనాథ్, సాయిబాబా,సురేష్,బస్వంత్ , రైతులు పాల్గొన్నారు.
సోయాబీన్ పంటపై క్షేత్ర శిక్షణ కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES