- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి : మండల కేంద్రానికి చెందిన ఆరుగొండ భాస్కర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకొని, నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు నా రెడ్డి మోహన్ రెడ్డి స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబానికి రూ.2500 ఆర్థిక సాయంతో పాటు 50 కేజీల బియ్యాన్ని అందించారు. బాధిత కుటుంబం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బిపేట నర్సింలు, కాంగ్రెస్ నాయకులు వడ్ల లక్ష్మీరాజ్యం, అంబాయి ప్రసాద్, చింతకుంట కిషన్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -