బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ – నసురుల్లాబాద్
ఆరోగ్య సమస్యతో అల్లాడుతున్న కుటంబానికి ఆర్థిక సహాయం చేస్తూ చేయూత నిచ్చారు. నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో కాలేయ వాదితో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన ఓ వికలాంగుడికి శుక్రవారం కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. డీసీసీ డెలిగేట్, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరమ్ మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావు ఆ యువకుడికి రూ.10వేలు ఆర్థిక సహాయం చేశారు. .ఈ కార్య క్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందుపటేల్, మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్, శివప్రసాద్ పాల్గొన్నారు.

Spread the love