- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని ఆదర్శ పాఠశాలలో బుధవారం నాంపల్లి సీఐ దూది రాజు, ఎస్సై రాంబాబు తో కలిసి జాతీయ సైబర్ జాగ్రత దివాస్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్ష తిరంగా- సైబర్ స్వతంత్ర తెలంగాణ దిశగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, స్టాక్స్ ఆన్లైన్ పెట్టుబడి మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉయ్యాల వెంకటేశ్,కానిస్టేబుల్ ప్రశాంత్, శిరీష పాల్గొన్నారు.
- Advertisement -


