- Advertisement -
నవతెలంగాణ – నకిరేకల్
మండలంలోని నోముల గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన రాచకొండ జానయ్య మాతృమూర్తి రాచకొండ లక్ష్మమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న బాల్యమిత్రులు జానయ్య కుటుంబానికి శుక్రవారం రూ. 23 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహాయం అందజేసిన వారిలో బాల్యమిత్రులు బాదీని రాము, దొంత చంద్రశేఖర్, బోల్లి కొండ సైదులు, దిండుగాల రాము, రాచకొండ నవీన్, కందాల కళ్యాణ్ చక్రవర్తి, భూపతి సతీష్, ఎండి ఆఫీస్, దిండుగాల నాగరాజు, మాచర్ల జలంధర్, యరకల సైదులు తదితరులు ఉన్నారు.
- Advertisement -