నవతెలంగాణ – చిన్నకోడూరు
మండల కేంద్రానికి చెందిన ఆరుట్ల రిక్షా మల్లయ్య మరణించిన విషయం కుండె తిరుపతి ద్వారా తెలుసుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి అదివారం మృతుడి నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి మనోధైర్యం నింపుతూ, తన వంతుగా రూ.5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. కష్టసమయంలో కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామానికి చెందిన పంపరి లక్ష్మణ్ (వికలాంగులు) వంగ రాజేశ్వర్ రెడ్డి రూ.5,000/- ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు, వికలాంగులు, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడంతోపాటు తన సాయి శక్తుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో కుండె తిరుపతి,టీంకు రాజేష్,కోనేటి మహేష్, పరకపల్లి అశోక్, దొంతరమైన రమేష్ తదితరులు పాల్గొన్నారు.



