Wednesday, May 21, 2025
Homeరాష్ట్రీయంఅర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

- Advertisement -

– నెలాఖరులోగా అకాడమీ భవనం ప్రారంభిస్తాం : సమాచార శాఖ మంత్రి పొంగులేటి
– జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైన జర్నలిస్టులతోపాటు వత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. వత్తిజీవితంలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు, తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలకు గురై వత్తి నిర్వహించలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు శుక్రవారం నాంపల్లిలోని ప్రెస్‌ అకాడమీ కార్యాలయంలో చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండల, నియోజకవర్గ స్థాయిలో పని చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తా మని తెలిపారు. మంచిని మంచిగా, నిజాన్ని నిర్భయంగా సమాజానికి తెలియజేసే దాంట్లో ఎంతో మంది జర్నలిస్టులు ఆణిముత్యాలుగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. జర్నలిస్టు వత్తిపై ఆధారపడి జీవితం మొత్తం ఆ జర్నలిజానికే అంకితమైనవాళ్లు ఎంతోమంది ఉన్నారని అన్నారు. ఆనాటి ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ప్రెస్‌ అకాడమీ భవనానికి చిన్న చిన్న మరమ్మత్తులు పూర్తి చేసుకుని ఈ నెల చివరిలోగా ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.42 కోట్లను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమం కోసం అకాడమి ఖర్చు పెడుతుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై వచ్చిన వడ్డీ ఆధారంగా ఇప్పటివరకు రూ.22 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన 597 మందికి రూ.1,00,000 పాటు ఐదేండ్ల వరకు, నెలకు రూ.3000 చొప్పున పెన్షన్‌, ట్యూషన్‌ ఫీజుల క్రింద ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదివే బాధిత జర్నలిస్టుల పిల్లలకు నెలకు రూ. 1,000 చొప్పున గరిష్టంగా ఇద్దరికి అందిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు రూ.8,98,39,000 మేర ఆర్థిక సహాయం చేసినట్టు చెప్పారు. ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి మాట్లాడుతూ ఈ సమాజంలో జర్నలిస్టు వత్తి అత్యంత కీలకమైనదని అన్నారు. తమ ప్రాణాలను లెక్క చేయకుండా సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారన్నారు. గడిచిన రెండ్రోజులుగా రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందో అన్న ఆతతతో ఎదురుచూస్తున్న ప్రజలకు జర్నలిస్టులు సమాచారాన్ని చేరవేస్తున్నారని కొనియాడారు. ప్రెస్‌ అకాడమీ చైర్మెన్‌ కె. శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని జర్నలిస్టుల సంక్షేమానికి నిధులను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ వినరు కష్ణారెడ్డి, అకాడమి కార్యదర్శి వెంకటేశ్వర్‌రావు, సమాచార శాఖ జేడీ జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -