ఎంపీడీఓ కార్యాలయం వద్ద పలువురు కల్లేపల్లి, వీరాపూర్ గ్రామస్తుల నిరసన
ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యలందరూ దొంగలేనని ఆరోపణలు
ఇందిరమ్మ ఇళ్లు మంజూరీ పత్రం చెల్లదంటూ అధికారుల దాటవేత
కల్లేపల్లిలో మళ్లీ పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక చేపట్టాలని డిమాండ్
నవతెలంగాణ – బెజ్జంకి
పదేకరాల వ్యవసాయ సాగు భూమి,గ్రామంలో స్థానికంగా లేని అనర్హులు,ఇండ్లున్నోళ్లకే అధికారులు ఇందిరమ్మ ఇండ్లూ మంజూరీ చేశారని కల్లేపల్లి, వీరాపూర్ గ్రామాలకు చెందిన పలువురు గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద కల్లేపల్లిలో మళ్లీ పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని అయా గ్రామాల గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.కల్లేపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులందరూ దొంగలేనని..ముడుపులు తీసుకుని అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని అవేదన వ్యక్తం చేశారు.గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు అర్హులను విస్మరించి..తమకనుగుణంగా ఉన్నోళ్లకే ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ చేయించారని అవేదన వ్యక్తం చేశారు.మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన వీరాపూర్ గ్రామంలో కొందరు అనర్హులను లబ్దిదారుల ఎంపిక చేశారని..అధికారులు అందజేసిన ఇందిరమ్మ ఇళ్లు మంజూరీ పత్రం ఇప్పుడు చెల్లదంటూ దాటవేసే దోరణి అవలంభిస్తున్నారని లబ్దిదారుడు ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అధికారులు పారదర్శకత పాటించలేదని ..అర్హులు న్యాయం చేసేలా ప్రభుత్వాధికారులు మళ్లీ లబ్దిదారులను ఎంపిక చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.ఎంపీడీఓ ప్రవీన్ నిరసనకారులను సందర్శించి వారి డిమాండును పై అధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు.
కల్లేపల్లిలో మళ్లీ చేపట్టాలి .. కల్లేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు ముడుపులు తీసుకుని అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు.అర్హులకు న్యాయం చేయడంలో అధికారులు విఫలమయ్యారు.గ్రామంలో అధికారులు క్షేత్ర స్థాయిలో సందర్శించి పారదర్శకంగా అర్హులకు న్యాయం చేయాలి. -అన్నాజీ రవి,గ్రామస్తుడు కల్లేపల్లి.
మంజూరీ పత్రం చెల్లదంటున్నారు..! మండలంలో వీరాపూర్ గ్రామాన్ని ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ ప్రాజెక్టు గ్రామంగా ఎంపిక చేశారు. అధికారులు ఇందిరమ్మ ఇళ్లు మంజూరీ చేసి పత్రమందజేశారు. తీర సమయానికి మంజూరీపత్రం చెల్లందంటున్నారు. అధికారులు అందజేసిన మంజూరీ పత్రం ప్రకారం అదేశాలిస్తే ఇళ్లు నిర్మించుకుని స్మరించుకుంటాను. -రాచకొండ శ్రీదర్ రావు,లబ్ధిదారుడు,వీరాపూర్.
ఇందిరమ్మ కమిటీ సూచన మేరకే ఎంపిక.... మండలంలోని కల్లేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యుల సూచన ప్రకారమే క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరీ పత్రాలను అందజేశాం. వీరాపూర్ గ్రామంలోని లబ్ధిదారునికి అందజేసిన మంజూరీ పత్రాన్ని పరిశీలించి పై అధికారులకు తేలియజేస్తాను. – ప్రవీన్, ఎంపీడీఓ, బెజ్జంకి.