- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ రెండు రోజులుగా యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో గత మూడు రోజులుగా మాజీమంత్రి హరీశ్ రావు ఫామ్ హౌస్లోనే ఉన్నారు. చికిత్స కోసం హైదరాబాద్కు తరలించే ఛాన్స్.. లేదంటే యశోద ఆస్పత్రి నుంచి డాక్టర్ల బృందాన్ని అక్కడికే రప్పించే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
- Advertisement -