Friday, May 30, 2025
E-PAPER
Homeజిల్లాలుశ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకున్నమాజీ మంత్రి హరీష్ రావు

శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకున్నమాజీ మంత్రి హరీష్ రావు

- Advertisement -


నవతెలంగాణ-రామారెడ్డి : మండలంలోని ఇసన్న పల్లి (రామారెడ్డి)లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానాన్ని మంగళవారం మాజీ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు.ఆలయ పూజారులు ఆలయ చరిత్రను ఆయనకు వివరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆయనకు శాలువాతో సన్మానించి, తీర్థ ప్రసాదాలు, స్వామివారి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు రాంచంద్రం, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, బిఆర్ఎస్ నాయకులు సత్యం రావు, పడిగల రాజేశ్వరరావు, సతీష్ గుప్తా, పడిగెల శ్రీనివాస్, ఆలయ పూజారులు శ్రీనివాస్ శర్మ, వంశీ శర్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -