- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు పెద్ద ఏడ్గి గ్రామానికి చెందిన బాలు నాయక్ గారి తండ్రి గురువారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకొన్న జుక్కల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శుక్రవారం స్థానిక బిఆర్అర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కలిసి అంత్యక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువ నాయకునికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. శాంతి చేకూరాలని, తమ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని, కుటుంబీకులను ఓదార్చారు. కార్యక్రమంలో షిండేతో పాటు నాయకులు, కుటుంబీకులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -