- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ నియోజకవర్గంలోని మండలాలలో కురిసిన భారీ వర్షాలకు నష్ట పరివారం అందించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ .. మండలంలో కురిసిన వర్షాలకు కోట్లలో పంట నష్టం జరిగిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నివేదికలను పంపించి నష్టపరిహారం మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని కలిసినట్లు వెల్లడించారు.
- Advertisement -