- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ తండ్రి మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలకు గురువారం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే హాజరై పాడే మోశారు. తండ్రి మృతి పట్ల బన్సీ పటేల్ ను ఆయన ఓదార్చారు. పార్టీ మండల అధ్యక్షుని తండ్రి మృతికి మాజీ ఎమ్మెల్యే ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ మద్నూర్ మండలం అధ్యక్షుని తండ్రి మృతి అంత్యక్రియలకు జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పిట్లం, పెద్ద కొడప్ గల్, తదితర మండలాల నుండి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలు హాజరయ్యారు.
- Advertisement -