Wednesday, December 24, 2025
E-PAPER
Homeజిల్లాలునాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

- Advertisement -

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ మల్లికార్జున్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ మల్లికార్జున్ డిమాండ్ చేశారు. బుధవారం రోజున సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశం  జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అధ్యక్షతన స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. 

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ మల్లికార్జున్  మాట్లాడుతూ.. కార్పొరేట్ యాజమాన్యాల ప్రయోజనాల కోసం సంపద సృష్టి కర్తలైన కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చే కుట్రలో భాగంగానే నాలుగు లేబర్ కోడ్ అమలు కోసం నవంబర్ 21 న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేశారని  విమర్శించారు. పోరాడి కార్మికులు సాధించుకున్న ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలకు పెంచు కునే విధంగా యజమాన్యాలకు అవకాశం కల్పిస్తూ కోడుల్లో పొందుపరిచారని విమర్శించారు. కార్మికుల సమ్మె చేసే హక్కును, యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కును ప్రశ్నార్థకం చేస్తూ లేబర్ కోడలు తీసుకువచ్చారని దుయ్యబట్టారు. పర్మనెంట్ అనే విధానం లేకుండా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ అనే విధానం తీసుకొచ్చి పని భద్రత లేకుండా చేశారని విమర్శించారు. 

18 వేల వేతనం దాటితే కార్మికుడు పరిధిలోకి రాడు అని కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తుందని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. మరోవైపు విద్యుత్ సవరణ 2025  పేరుతో బిల్లు తీసుకొచ్చారని దీనివలన రైతులు సబ్సిడీ పొందే అవకాశాలు లేకుండా, రాష్ట్రాల హక్కులు నష్టపోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరు గార్చుతూ  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విభి జి రామ్ జి పేరుతో మార్పు చేశారని కేంద్ర ప్రభుత్వం గతంలో 90% నిధులు కేటాయిస్తే ప్రస్తుతం 60 శాతానికి పరిమితం చేసి మిగతా 40 శాతాన్ని రాష్ట్రాలపై రుద్దుతూ ఉపాధి పథకాన్ని క్రమంగా ఎత్తివేసే కుట్రలో  భాగంగానే బిజెపి ఈ నాటక మాడుతుందని విమర్శించారు.

భీమా రంగంలో 100% ఎఫ్డిఐ లకు వెసులుబాటు కల్పిస్తూ సబ్కా భీమా సబీ రక్ష అనే పేరుతో భీమా చట్టాల బిల్లు తీసుకొచ్చిందని ఇది ఉద్యోగులకు లబ్ధిదారులకు అత్యంత ప్రమాదకరమైనదని కేవలం బీమా కంపెనీల పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేటివని దేశ ప్రజలకి తీవ్ర నష్టదాయకమని తెలియజేశారు. ప్రభుత్వ రంగంలో ఉత్పత్తి అయ్యే న్యూక్లియర్ ను ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగంగానే న్యూక్లియర్ సేఫ్టీ ఎకౌంటబిలిటీ మరియు సార్వభౌమాధికారం అనే పేరుతో బిల్లు తీసుకొచ్చారని విమర్శించారు నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వ విధానాలు కార్మికులు, రైతులు, ఉద్యోగులు పేద ప్రజలపై ఏకకాలంలో  దాడి చేస్తున్నదని ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన ఉద్యమం నిర్మించడం కోసం ప్రజా సంఘాలు సమయతమవుతున్నాయని అందులో భాగంగా డిసెంబర్ 26న  దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమంలో, జనవరి 19 న జరిగే కార్మిక కర్షక ఐక్యత ర్యాలీలో కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మోడీ విధానాలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం,జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు, మాయ కృష్ణ , దోనూరి నర్సిరెడ్డి,జిల్లా కోశాధికారి ఎండి పాషా,జిల్లా సహాయ కార్యదర్శులు గొరిగే సోములు, తుర్కపల్లి సురేందర్, చెక్క రమేష్ ,పొట్ట యాదమ్మ, సిల్వేరు రామకుమారి, పైళ్ల గణపతి రెడ్డి ,జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్,గంధమల్ల మాతయ్య, మొరిగాడి రమేష్,బూరుగు స్వప్న చీమకండ్ల శ్రీరాములు, రాధారపు మల్లేశం ,పోతరాజు జహంగీర్ ,బత్తుల దాసు,తూటి వెంకటేష్,,యస్ డి ఉమర్, సిహెచ్ శ్రీను, జొన్న కంటి దేవయ్య,కొండే నరసింహ జంగయ్య లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -