Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుగర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు ఉచిత ఆటో సర్వీస్ ను ప్రారంభం..

గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు ఉచిత ఆటో సర్వీస్ ను ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్, మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్ష,  కార్యదర్శిలు ఎండీ ఇంతియాజ్ అహ్మద్, ఎండీ ఇస్తియాక్ ల ఆధ్వర్యంలో వారి జన్మదిన సందర్భంగా  ప్రభుత్వ ఆసుపత్రి లొ చికిత్స పొందే గర్భిణీ, స్త్రీలకు, వికలాంగులకు, బాలలకు, భువనగిరి పట్టణ వ్యాప్తంగా ఉచిత ఆటో సర్వీస్ ను ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథులుగా  శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, భువనగిరి, నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభం, అనిల్ కుమార్ రెడ్డి లు హాజరై,  ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ..సోషల్ యాక్టివిస్ట్, హ్యూమన్ రైట్స్ అధ్యక్ష కార్యదర్శి లు ఎండీ ఇంతియాజ్ అహ్మద్, ఎండీ ఇస్తియాక్ అహ్మద్ లు కరోనా కష్ట కాలం లొ కుల మతాలకు అతీతంగా ఉచితంగా నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందించడం, విద్యార్థులకు ఫీజులు చెల్లించడం ప్రతి సంవత్సరం రంజాన్ లొ రేషన్ కిట్స్ ఇవ్వడం తొ పాటు నగదు డబ్బులను అందజేయడం జరిగిందని అన్నారు. 

 ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు వికలాంగులకు,నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఉచిత ఆటో సర్వీస్ ను ప్రారంభం చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. ప్రభుత్వ పరంగా మా పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ రావు,అడిషనల్ కలెక్టర్ వీర రెడ్డి,ఆర్డీఓ కృష్ణ రెడ్డి, గ్రంధాలయం చైర్మన్ అవేస్ చిస్తీ,డీసీపీ ఆకాంక్ష్ యాదవ్,ఏసీపీ రాహుల్ రెడ్డి తహసీల్దార్ అంజిరెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ పోతం శెట్టి వెంకటేష్వర్లు,డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎండీ మజహర్ పీసీసీ మెంబర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్, మాజీ కౌన్సిలర్లు నాజిమా సలవొద్దీన్,లయీ క్ అహ్మద్ టీమ్ మెంబర్స్ ఇమ్రాన్ ఖాన్ ఎండీ ఇర్ఫాన్,షకీల్ లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad