- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
మహాశివరాత్రి సందర్భంగా కలమడుగు గోదావరి వద్ద జన్నారం మండల కేంద్రానికి చెందిన భవానీ పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ఉచిత క్యాంప్ నిర్వహించారు. గోదావరి స్నానాలకు వచ్చిన పిల్లలకు పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కశ్యప్ శ్రీవాత్సవ్ ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పిల్లల కోసం ఉచిత క్యాంప్ నిర్వహించిన భవాని పిల్లల హాస్పిటల్ యజమాన్యాన్ని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బొంతల నాగమణి మల్లేష్,రవీందర్,హరీష్ రెడ్డి, నగేష్, శ్రీనివాస్, కాండ్రపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



