- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆదివారం వచ్చిందంటే చికెన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. మొన్నటి వరకు కిలో రూ. 300 వరకు చేరిన చికెన్ ధరలు, శ్రావణ మాసం ప్రారంభంతో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కిలో చికెన్ రూ. 250 లోపే లభిస్తోంది. శ్రావణ మాసం, వినాయక చవితి, దేవీ నవరాత్రులు వంటి పండుగలు వరుసగా ఉండటంతో ధరలు మరింత అదుపులోకి వచ్చే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్కిన్ లెస్ చికెన్ రూ. 220-240, లైవ్ చికెన్ రూ. 140-160 మధ్య లభిస్తుండగా, స్కిన్ చికెన్ రూ. 228-250, స్కిన్ లెస్ చికెన్ రూ. 259-300, బోన్లెస్ చికెన్ రూ. 400-500 వరకు పలుకుతోంది.
- Advertisement -



