నవతెలంగాణ – అచ్చంపేట : పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి జిల్లా అందత్వ నియంత్రణ సంస్థ, కందూరు రామ్ రెడ్డి లయన్స్ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరము నిర్వహించారు. శిబిరాన్ని డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తారాసింగ్ ప్రారంభించారు. 68 మందికి కంటి రోగులను పరీక్షించి వీరిలో 52 మంది కి కంటిశుక్లాలు ఉన్నట్లు నిర్ధారించారు. కంటి ఆపరేషన్ నిమిత్తమై ప్రత్యేక అంబులెన్స్ లో కందూరు రామ్ రెడ్డి లయన్స్ కంటి ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఆపరేషన్ పూర్తైన అనంతరం తిరిగి వాళ్ళ సొంత గ్రామాలకు ఇంటిదగ్గర వదిలిపెడుతున్నట్లు వైద్య శిబిరం సిబ్బంది తెలిపారు. ఈ శిబిర కార్యక్రమంలో రిటైర్డ్ ఆప్తాలమిక్ అధికారి సిహెచ్ గణేష్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES