Monday, January 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫుల్‌ ఫన్‌ రైడ్‌ సినిమా

ఫుల్‌ ఫన్‌ రైడ్‌ సినిమా

- Advertisement -

రవితేజ, దర్శకుడు కిషోర్‌ తిరుమల కాంబోలో సుధాకర్‌ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్‌ హయతి, ఆషిక రంగనాథ్‌ కథనాయికలుగా నటించిన ఈ చిత్రం ఈనెల13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ఘనంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. రవితేజ మాట్లాడుతూ, ‘మా ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌, నేను కలిసి 13 సినిమాలు చేశాం. మా సినిమాలన్నీ దాదాపు హిట్‌ అయ్యాయి. ఈ సినిమాలో మా హీరోయిన్స్‌ చాలా అందంగా కనిపిస్తారు. నన్ను కూడా చాలా అందంగా చూపించాడు డీవోపీ ప్రసాద్‌ మూరెళ్ళ. తనతో తొమ్మిది సినిమాలు చేశాను. కొరియోగ్రాఫర్స్‌ శేఖర్‌, భాను కంపోజ్‌ చేసిన పాటలన్నీ కూడా సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఫైట్‌ మాస్టర్‌ పద్వి ఇందులో ఎంటర్‌టైనింగ్‌గా ఉండే ఫైట్లు కంపోజ్‌ చేశారు. ప్రొడ్యూసర్‌ సుధాకర్‌ చెరుకూరి సినిమాని చాలా ప్యాషన్‌తో చేశారు.

ఇందులో సునీల్‌తో మళ్ళీ దుబాయ్ శీను లాంటి ఫన్‌ చూడబోతున్నారు. సత్య కిషోర్‌, మురళీధర్‌, గెటప్‌ శీను, సోని అందరు కూడా అద్భుతంగా చేశారు. అనిల్‌ రావిపూడి, హరీష్‌ శంకర్‌, బాబి, కిషోర్‌.. వీరి డైరెక్షన్‌లో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తూ వర్క్‌ చేస్తాను. నెక్స్ట్‌ శివ నిర్వాణతో చేస్తున్నాను. బీమ్స్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చాడు. హీరోయిన్స్‌ చాలా బ్రహ్మాండంగా నటించారు. మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్‌ కిషోర్‌ ఈ సినిమాతో చాలా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్‌ చేశారు. ఈ సినిమా ఫుల్‌ ఫన్‌ రైడ్‌లా ఉంటుంది’ అని తెలిపారు. ‘సుధాకర్‌ చెరుకూరి చాలా సెన్సిబుల్‌ ప్రొడ్యూసర్‌. ఈ సినిమా కంటెంట్‌ చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్‌ చూసిన వెంటనే బ్లాక్‌బస్టర్‌ ఫీలింగ్‌ వచ్చింది. కచ్చితంగా ఇది బ్లాక్‌ బస్టర్‌. కిషోర్‌ తిరుమల కూడా సెన్సిబుల్‌ డైరెక్టర్‌. తప్పకుండా ఈ సినిమా తనకి బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’ అని డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ చెప్పారు.

డైరెక్టర్‌ బాబీ మాట్లాడుతూ,’మాలాంటి ఎంతో మంది డైరెక్టర్స్‌ అయ్యారంటే రవితేజ పెట్టిన బిక్ష. ”పవర్‌” సినిమా టైంలో డైరెక్టర్‌ కిషోర్‌ డైలాగ్స్‌ విషయంలో నాకు చాలా హెల్ప్‌ చేశారు. కచ్చితంగా తన నిజాయితీ, తన హార్డ్‌ వర్క్‌ ఈ సినిమాకి పే చేస్తుంది. ఈ సినిమా చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉందని చాలా మంది చెప్పారు’ అని అన్నారు. ప్రొడ్యూసర్‌ సుధాకర్‌ చెరుకూరి మాట్లాడుతూ,’ఈనెల 13న మా బీఎండబ్ల్యూ (భర్త మహాశయులకు విజ్ఞప్తి) రైడ్‌కి వెళ్ళండి. కచ్చితంగా అదిరిపోతుంది’ అని చెప్పారు. ‘ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్‌ చేశాను. ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రతి యాక్టర్‌ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వర్కౌట్‌ అయింది. ఈనెల 13న తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అందరూ సినిమాని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’ అని డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -