- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ,కార్మికులకు,కర్షకులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గురువారం మండల కేంద్రంలో విజయవంతంగా ముగిసింది. సీపీఐ(ఎం), సిపిఐ పార్టీ శ్రేణులతో పాటు సిఐటియు అనుబంధ సంఘాలు సమ్మెలో పాల్గొని ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఈదుల బిక్షం రెడ్డి, సిపిఐ మండల కన్వీనర్ బుర్ర శేఖర్, సిఐటియు మండల కన్వీనర్ ఏర్పుల పద్మ, సిఐటియు అనుబంధ సంఘాల కార్మికులు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



