Tuesday, October 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మిక వర్గ హక్కులకై సమరశీల ఉద్యమాలకు సిద్ధం కండి...

కార్మిక వర్గ హక్కులకై సమరశీల ఉద్యమాలకు సిద్ధం కండి…

- Advertisement -

సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ..
నవతెలంగాణ – మునుగోడు

కార్మిక వర్గ హక్కుల సాధన కోసం కార్మికులందరూ సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక  పిలుపునిచ్చారు. మంగళవారం సిఐటియు మునుగోడు మండల జనరల్ బాడీ సమావేశం సత్యం ఫంక్షన్ హాల్ లో ఎర్రగోని లింగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం ఐక్యంగా సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 1970లో ఐక్యత పోరాటం నినాదంతో సిఐటియు ఆవిర్భవించిందని నాటినుండి నేటి వరకు కార్మిక వర్గాన్ని ఒక వర్గంగా ఐక్యం చేయడం కోసం వారి హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి విజయాలు సాధించిందని అన్నారు.

బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మిక వర్గాన్ని పెట్టుబడుదారులు మరింత దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ,దేశంలో సహజ వనరులన్నీ బడా కార్పొరేట్ పెట్టుబడుదారులకు అప్పనంగా అప్పజెప్తోందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందర కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చిందని ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కార్మికులను మోసం చేసిందని విమర్శించారు.కార్మిక వర్గ సమస్యల పై చర్చించడానికి నవంబర్ 3వ వారంలో నల్లగొండలో జరిగే సిఐటియు జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమములో మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, పిఎన్ఎం జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, రైతు సంఘం మండల అధ్యక్షులు వేముల లింగస్వామి, జీపీ మండల కార్యదర్శి బుడిగా లింగస్వామి, అండాలు, ఎర్రా అరుణ, డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి, ఆశా వర్కర్స్ జ్యోతి, కమల, ధనలక్ష్మి, భవనం నిర్మాణ కార్మిక సంఘం పగడాల సైదులు, డాక్టర్ యూనియన్ యాట రామస్వామి, వెంకటేష్, మధ్యాహ్న భోజనం రాజ్యలక్ష్మి, అలివేలు, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -