Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ ఉద్యోగులుగా గిర్దావర్, జూనియర్ అసిస్టెంట్

ఉత్తమ ఉద్యోగులుగా గిర్దావర్, జూనియర్ అసిస్టెంట్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న గిర్దావర్ ఎం. శంకర్, జూనియర్ అసిస్టెంట్ యు. రవి కుమార్ లు ఉత్తమ ఉద్యోగులుగా ఇంచార్జీ కలెక్టర్ వి విక్టర్,  డి ఆర్ ఓ మధుకర్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా మద్నూర్ తహశీల్దార్ ఎం డి. ముజీబ్  మాట్లాడుతూ.. తమ ఉద్యోగులు ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక కావటం అభినందనీయం అన్నారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రశంసలు ఆదర్శంగా తీసుకొని ఇంకా నిబద్ధతతో పని చెయ్యాలని సూచించారు. 

ప్రశంసా పత్రాలు అందుకున్న శంకర్, రవి లు మాట్లాడుతూ.. తమ సేవలను గుర్తించినందుకు జిల్లా కలెక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, మద్నూర్ తహసీల్దార్ ఎండి ముజీబ్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ లో ఇంకా నిబద్ధతతో పని చేస్తామని, ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -