క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌..

నవతెలంగాణ – హైదరాబాద్: ఉచితంగా చూసే క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు  గుడ్‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌..  ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 జూన్ 1 నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగబోయే టీ20 మ్యాచ్ లకు ఫ్రీ గా చూసే అవకాశం అభిమానులకి కలిగింది. వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను డిస్నీ హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌లో ఫ్రీగా చూడొచ్చు. ఈ మేరకు ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ తమ మొబైల్స్‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌ లేకుండా ఈ మెగా టోర్నీని వీక్షించొచ్చని డిస్నీబుధవారం (మే 7) వెల్లడించింది. ఎక్కువ మందికి క్రికెట్‌‌‌‌‌‌‌‌ వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లతో జియో సినిమా సూపర్‌‌‌‌‌‌‌‌ వ్యూయర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ సాధించడంతో ఇప్పుడు డిస్నీ కూడా డిజిటల్​ ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఐసీసీ టోర్నీలకు సంబంధించిన టీవీ రైట్స్‌‌‌‌‌‌‌‌ మొత్తం డిస్నీ హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌ చేతుల్లో ఉండటంతో ఫ్రీ లైవ్‌‌‌‌‌‌‌‌కు గేట్లు తెరిచింది. 2023 లో భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ తో పాటు, ఆసియా కప్ టోర్నీలను హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌ ఫ్రీ గా చూసే అవకాశం కల్పించింది. అయితే టీవీ, ఇతర వాటిలో చూసే వాటికి మాత్రం ఆయా రేట్లు వర్తించనున్నాయి.

Spread the love