- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలో శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-2027 సంవత్సరానికి ప్రవేశాల కొరకు, కళాశాల దోస్త్ కమిటీ తయారు చేసిన బ్రోచర్ ను కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, జనగాం ఉపేందర్ రెడ్డి అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధుల ప్రవేశాలకు ప్రధానాచార్యులు, అధ్యాపక బృందం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని అభినందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆలేరు కళాశాల లో ప్రవేశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజారామ్, దోస్త్ కమిటీ కన్వీనర్ నందకుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



