పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబయ్య
నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల మందు బాబులకు అడ్డాగా మారుతుందని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబయ్య వాపోతున్నారు. ఈ పాఠశాలకు కాంపౌండ్ వాళ్ళు లేక రాత్రి వేళల్లో గ్రామంలోని గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల లోకి వెళ్లి మద్యం సేవిస్తున్నట్లు తెలిపారు. మందు బాటిల్లు పారవేసిన వాటిని చూపిస్తూ ఒక విద్యావాలయాన్ని గ్రామస్తులు మద్యం సేవించే గదులుగా మారుస్తున్నారని ఆయన వాపోయారు. ఆ గ్రామాన్ని సందర్శించిన విలేకరులకు పలువురు గ్రామస్తుల ద్వారా తాగి పారవేసిన మద్యం బాటిల్లను చూపించారు. దీనికి ప్రధానమైన కారణం కాంపౌండ్ వాల్ లేకపోవడమేనని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. పాఠశాల శుభ్రతను దృష్టిలో పెట్టుకొని వెంటనే కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మందుబాబులకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాలలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES