Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నాలుగైదు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి.!

నాలుగైదు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి.!

- Advertisement -

తాడిచెర్ల పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
: అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను నాలుగైదు రోజుల్లో పూర్తి చేస్తామని తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య అన్నారు. మండలంలో కొయ్యుర్, వళ్లెంకుంట గ్రామాల్లో పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం రైతుల ధాన్యం పూర్తి స్థాయిలో సేకరిస్తామన్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన 13 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తి చేస్తున్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయిత రాజిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad